తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ , తిరుపతి నుండి ఉమెన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
అర్హతలు :
- పదో తరగతి పాస్ అయి ఉండాలి
- ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి
- బరువు 40 కేజీలు లోపు ఉండకూడదు.
- వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి
ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అప్లికేషన్ చివరి తేదీ : 08-01-2023
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : O/o CEO, SLSMPC , Room No.63 , TTD అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, KT రోడ్, తిరుపతి.
✅ ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారిలో అర్హులైన వారిని తదుపరి సెలక్షన్స్ కి పిలుస్తూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఈ లిస్టులో పేరు ఉన్నవారు మాత్రమే తదుపరి సెలెక్షన్స్ కు హాజరు కావాలి.
ఎంపికలు నిర్వహించే తేదీ : 10-01-2023
ఎంపికలు జరిగే ప్రదేశం : శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గ్రౌండ్ , తిరుపతి.
జీతము : 17,438/- రూపాయలు ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 43
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలలో భాగంగా 100 మీటర్లు లేదా 50 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. ఈ పరుగుపందెంలో అర్హత సాధిస్తే సరిపోతుంది . ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్లో పరిగణించరు.
అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఒక అభ్యర్థికి 70 శాతం మార్కులు పదో తరగతిలో వస్తే వారికి ప్రతి 10 శాతానికి ఒక మార్కు చొప్పున ఏడు మార్కులు కేటాయిస్తారు. అదనపు అర్హతలు ఉండే వారికి ప్రతి అదనపు అర్హతకు ఒక మార్కు చొప్పున కలపడం జరుగుతుంది.
Download Notification & Application