Headlines

2,137 పోస్టులకు నాలుగు జాబ్ మేళాలు | ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ | New Job Mela Details in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నిర్వహించే జాబ్ మేళాలకు సంబంధించిన వివరాలును ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ అనే సంస్థ తన అధికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. 

దీని ప్రకారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ నెలలో మరికొన్ని జాబ్ మేళాలు నిర్వహించబోతున్నారు. ఈ జాబ్ మేళాలు ద్వారా మొత్తం 2,137 పోస్టులను వివిధ ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో భర్తీ చేస్తారు.

వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకొని మీకు దగ్గరలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. పదో తరగతి నుంచి పీజీ వరకు వివిధ రకాల అర్హతలు ఉన్నవారు తమ అర్హతకు తగిన ఉద్యోగం పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం.

👉 రైల్వేలో 3,115 పోస్టులకు పరీక్ష లేకుండా ఎంపిక – Click here 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 2,137

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొనవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీలు : సెప్టెంబర్ 17,18,19,20 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..

👉  AP ప్రభుత్వం ద్వారా శిక్షణ + లక్షకు పైగా జీతము వచ్చే ఉద్యోగాలు – Click here 

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. జాబ్ మేళాలో పాల్గొనేటప్పుడు కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి. 
  • ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

🏹 పాలకొండలో శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో 16 ప్రముఖ సంస్థల్లో 1010 పోస్టులకు సెప్టెంబర్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

పాలకొండలో జరిగే జాబ్ మేళా వివరాలు – Click here 

🏹 తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలులో SVR గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నాలుగు ప్రముఖ సంస్థల్లో 232 పోస్టులకు సెప్టెంబర్ 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.  

నిడదవోలు లో జరిగే జాబ్ మేళా వివరాలు – Click here 

🏹 పాడేరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 5 ప్రముఖ సంస్థలలో 215 పోస్ట్ లకు సెప్టెంబర్ 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

పాడేరులో జరిగే జాబ్ మేళా వివరాలు – Click here 

🏹 నంద్యాల జిల్లా ఆత్మకూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఐదు ప్రముఖ సంస్థల్లో 680 పోస్టులకు సెప్టెంబర్ 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఆత్మకూరులో జరిగే జాబ్ మేళా వివరాలు – Click here 
🔥 అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి. ఇంటర్వ్యూకి వెళ్లేవారు తమ యొక్క బయోడేటా తో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు , పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా హాజరు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!