ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మరి కొద్ది రోజుల్లోనే పలితాలు విడుదల కి అన్ని ఏర్పాటు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- పలితాలు విడుదల చేసేందుకు గాను డేట్ ఫిక్స్ అయినట్లు గా తెలుస్తోంది.
- ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసారు. ఏప్రిల్ 01 , 2025 న చివరి పరీక్ష సోషల్ పరీక్ష జరిగింది. మొదటిగా మార్చ్ 31 న చివరి పరీక్ష ను నిర్వహించాలి అని భావించినా రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 01 న నిర్వహించారు.
- మొత్తం 2,800 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.
- అయితే విద్యార్థుల పరీక్ష ఫలితాలు ను చెక్ చేసుకొనేందుకు ఎక్కువ సమయం వేచివుండాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వివిధ విధానాలను అవలంబిస్తుంది.
- ఇందులో భాగంగా అతి త్వరగా రిజల్ట్స్ తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా & SMS ద్వారా & అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకొనేందు అవకాశం కల్పించనున్నారు.
🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం :
- పదవ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కొరకు ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వారు అన్ని ఏర్పాట్లు చేసారు.
- ఏప్రిల్ 03 నుండి మూల్యాంకనం ప్రారంభమైనది. మొత్తం 26 జిల్లాలలో 26 జిల్లా కేంద్రాలలో మూల్యాంకనం కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- ఎగ్జామినర్ & సహాయ ఎగ్జామినర్ లను నియమించి , ప్రశ్న పత్రాలు ముల్యాంకనం జరుగుతుంది. సహాయ ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను దిద్దే విధంగా ఏర్పాటు చేశారు. అలానే ముల్యాంకన కేంద్రాలలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
🔥పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల :
- పరీక్షలు ముగియడంతో విద్యార్థులు & తల్లితండ్రులు ఫలితాల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషనన్ వారు వీలైనంత త్వరగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి , ఫలితాలు విడుదల చేసేందుకు గాను సిద్ధంగా ఉంది.
🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :
- వాట్సాప్ ద్వారా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
పలితాలు విడుదల కానే ఆటోమేటిక్ గా పలితాలు రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు వస్తాయి.
- SMS ద్వారా : అధికారిక ఫోన్ నెంబర్ కు హల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేసి,SMS ద్వారా పలితాలు తెలుసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ ద్వారా :విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (APBSE) వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
🔥 ఏప్రిల్ 22 న పదవ తరగతి ఫలితాలు విడుదల
- పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఫలితాలు కంప్యూటరీకరణ జరుగుతుంది.
- మరికొద్ది రోజులలో కంప్యూటరీకరణ కూడా పూర్తి అవుతుంది.
- ఆ తర్వాత ఫలితాలు ను పలు దఫాలు పరిశీలన చేసి, ఫలితాలను విడుదల చేసేందుకు గాను కృషి చేస్తుంది.
- వీలనంత త్వరగా అన్ని పనులను పూర్తి చేసి, ఏప్రిల్ 22 రోజు ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
- అది కుదరకపోతే అటు ఇటుగా మరో రెండు రోజులలో పలితాలు విడుదల అవుతాయి.
🔥 Click here for official APBSE website