Headlines

AP లో 758 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఉపాధి కార్యాలయం | AP District Employment Office Mega Job Mela | AP Jobs | Latest Jobs in Andhrapradesh 

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? వెంటనే ఉద్యోగం కావాలా ? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్లండి. మీ విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందండి. 

పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి విద్యార్హత ఉన్న ఈ నెల 23వ తేదీన జరిగే జాబ్ మేళాలో పాల్గొనండి.. తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది.. దీనికోసం మీరు చేయాల్సినదల్లా ఎటువంటి ఫీజు లేకుండా ఇంటర్వ్యూ కు వెళ్లేముందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో బయోడేటా మరియు మీ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరైతే చాలు. 

8 ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలకు ఈ మెగా జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్నారు. 

ఈ జాబ్ మేళా ఎక్కడ జరుగుతుంది ? ఏ సంస్థల్లో ఏ ఏ పోస్టులకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ? ఎంపిక అయితే మీకు ఎంత జీతం ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి. All the best 👍 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా.

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 

  • తమిళనాడులోని తిరువల్లూర్ లో ఉన్న అమెజాన్ వేర్ హౌస్ లో పదో తరగతి పూర్తిచేసిన వారితో 400 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 
  • విశాఖపట్నంలో ఉన్న WNS సంస్థలో డిగ్రీ విద్యార్హతతో 50 అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • విశాఖపట్నంలో ఉన్న ముత్తూట్ గ్రూపులో డిగ్రీ ,ఎంబీఏ , ఎంకామ్ పూర్తిచేసిన వారితో 100 ఇంటర్న్ ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • విశాఖపట్నంలో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ లో పదో తరగతి ,ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలతో 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు 
  • విశాఖపట్నంలో ఉన్న ఫ్లూయెంట్ గ్రేడ్ లిమిటెడ్ లో ఐటిఐ ఎలక్ట్రికల్ లేదా డిప్లమో ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారితో 100 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • విశాఖపట్నం లో ఉన్న నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ బ్రాంచ్ లో ఇంటర్, డిగ్రీ , PG పూర్తి చేసిన వారితో 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • విశాఖపట్నంలో ఉన్న శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్ లెదర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • విశాఖపట్నంలో ఉన్న అపోలో ఫార్మసీ బ్రాంచ్ లలో టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారితో 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు 

🔥 అర్హతలు :  10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి.ఫార్మసీ / బీ.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : 23-08-2024 తేదీన ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : విశాఖపట్నం జిల్లాలో కంచరపాలెం లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే సంస్థలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది.

  • ప్రారంభంలో కనీసం 10,000 నుండి 31,200/- వేల రూపాయల వరకు జీతం వచ్చే విధంగా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!