Headlines

APPSC Group 2 Notification 2023 In Telugu | APPSC Group 2 Syllabus in Telugu | APPSC OTPR Login

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 897 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 సర్వీసెస్ లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు 897 ఉన్నాయి . అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉండగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఓటిపిఆర్ ను లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయవచ్చు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఇప్పటి వరకు ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయని అభ్యర్థులు కొత్తగా తమ బయోడేటా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్లు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి యూజర్ ఐడి పంపించడం జరుగుతుంది.

ఓటిపిఆర్ లాగిన్ ఉన్నవారు ఆ వివరాలుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 21వ తేదీ నుండి 2024 లో జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

అలాగే ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది.

ఈ ప్రిలిమినరీ పరీక్ష 2024 లో ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్ లో ముందుగానే తెలియజేయడం జరిగింది.

ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు ఇస్తారు.  

మెయిన్స్ పరీక్షలో పేపర్ వన్ మరియు పేపర్ 2 ఉంటాయి పేపర్ 1 మరియు పేపర్ టు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.

 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ఓఎంఆర్ విధానంలో లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు .

ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.. 

ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.. ⅓ వంతు నెగెటివ్ మార్కుల విధానములో ఉంటాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!